వైసీపీ నేత... స్థలం కబ్జా యత్నం

ABN , First Publish Date - 2020-12-01T05:50:12+05:30 IST

నాదెండ్ల పరిధిలోని సాతులూరు గ్రామంలో రోడ్డులంక భూమిని కబ్జా చేసేందుకు యత్నించి తనపై దా డికి పాల్పడిన వైసీపీ నాయకుడు చేరెడ్డి కృష్ణా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సాతులూరుకు చెందిన కొత్తపల్లి మాలతి అనే మహిళ దళిత, ప్రజాసంఘాలు రజక నాయకుల సంఘం తదిత రులతో రూరల్‌ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్ర యించారు.

వైసీపీ నేత... స్థలం కబ్జా యత్నం

రూరల్‌ ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు


గుంటూరు, నవంబరు 30: నాదెండ్ల పరిధిలోని సాతులూరు గ్రామంలో రోడ్డులంక భూమిని కబ్జా చేసేందుకు యత్నించి తనపై దా డికి పాల్పడిన వైసీపీ నాయకుడు చేరెడ్డి కృష్ణా రెడ్డిపై చర్యలు తీసుకోవాలని  సాతులూరుకు చెందిన కొత్తపల్లి మాలతి అనే మహిళ దళిత, ప్రజాసంఘాలు రజక నాయకుల సంఘం తదిత రులతో రూరల్‌ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్ర యించారు.  ఎప్పటి నుంచో అందులో హోటల్‌ నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషిం చుకుం టున్నానని వాపోయారు.  కృష్ణారెడ్డి  హోటల్‌ నిర్వహించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై గత్యంతరం లేక తాను ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. అయితే పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవటం లేదని తెలిపారు.  

Updated Date - 2020-12-01T05:50:12+05:30 IST