చిట్టీల పేరుతో మోసం చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలి
ABN , First Publish Date - 2021-01-21T07:14:43+05:30 IST
చిట్టీల పేరుతో వందలాది మంది బాధితులను మోసం చేసిన గాజులరామారానికి చెందిన నిర్మలారెడ్డి, ఆమె భర్త సుదర్శన్రెడ్డి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని బీసీ మహిళా సమాఖ్య నాయకురాలు మట్ట జయంతిగౌడ్, బాధితులు జ్ఞానేశ్వర్, ప్రతాప్రెడ్డి, జానకిరాం, రంగారెడ్డి, వీరేశం, స్వామి, సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
బర్కత్పుర,
జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చిట్టీల పేరుతో వందలాది మంది బాధితులను మోసం
చేసిన గాజులరామారానికి చెందిన నిర్మలారెడ్డి, ఆమె భర్త సుదర్శన్రెడ్డి
ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని బీసీ మహిళా సమాఖ్య
నాయకురాలు మట్ట జయంతిగౌడ్, బాధితులు జ్ఞానేశ్వర్, ప్రతాప్రెడ్డి,
జానకిరాం, రంగారెడ్డి, వీరేశం, స్వామి, సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
దాదాపు 6 నుంచి 9 కోట్ల రూపాయల వరకు మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.
బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో వారు మాట్లాడారు. చిట్టీల పేరుతో
నిర్మలారెడ్డి, సుదర్శన్రెడ్డి ఒక్కొక్కరికి 30 నుంచి 45 లక్షల వరకు
చెల్లించాల్సి ఉందన్నారు. జగద్గిరిగుట్ట పీఎ్సలో ఫిర్యాదు కూడా చేశామని
వారు తెలిపారు.