ఐసీయూలో ఎలుక కాటుకు గురైన రోగి మృతి

ABN , First Publish Date - 2021-06-24T13:36:25+05:30 IST

మహారాష్ట్రలోని ముంబై నగరంలోని రాజవాడి ఆసుపత్రిలోని ఐసీయూలో ఎలుక కాటుకు గురైన రోగి మృతి ...

ఐసీయూలో ఎలుక కాటుకు గురైన రోగి మృతి

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై నగరంలోని రాజవాడి ఆసుపత్రిలోని ఐసీయూలో ఎలుక కాటుకు గురైన రోగి మృతి చెందారు. శ్రీనివాసన్ మెనింజైటీస్, కాలేయ సమస్యలతో బాధపడుతూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతున్న రాజవాడి ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాసన్ కు కంటి వద్ద ఎలుక కరిచింది.తన సోదరుడికి ఎలుక కరిచిన తర్వాత బుధవారం రాత్రి 8 గంటల వరకు చూడటానికి అనుమతించలేదని, ఆ తర్వాత మరణించారని చెప్పారని యశోద విలపిస్తూ చెప్పారు. తన సోదరుడికి జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదని, దీనిపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యశోద డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి రాజావాడి ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ విద్యాఠాకూర్ అందుబాటులో లేరు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ చెప్పారు. 

Updated Date - 2021-06-24T13:36:25+05:30 IST