పోస్టింగ్‌ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు

ABN , First Publish Date - 2021-01-27T06:19:41+05:30 IST

పోలీసులు పోస్టింగ్‌ల కోసం అడ్డదారులు తొక్కుతూ టీఆర్‌ఎస్‌ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆర్‌టీసీ మాజీ చైర్మన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ధ్వజమెత్తారు.

పోస్టింగ్‌ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సోమారపు సత్యనారాయణ

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ 

గోదావరిఖని, జనవరి 26: పోలీసులు పోస్టింగ్‌ల కోసం అడ్డదారులు తొక్కుతూ టీఆర్‌ఎస్‌ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆర్‌టీసీ మాజీ చైర్మన్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం కౌన్సిల్‌ హాల్‌లోకి పోలీసులు రావడం సరైందికాదన్నారు. కార్పొరేషన్‌ అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్‌, కార్పొరేటర్‌ కిషన్‌రెడ్డి, బీజేపీ నాయకులు బల్మూరి అమరేందర్‌రావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:19:41+05:30 IST