విధుల్లోకి తీసుకోవాలంటూ సీఆర్టీల నిరసన
ABN , First Publish Date - 2021-10-19T05:33:14+05:30 IST
ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశా లల్లో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న గిరిజన సీఆర్టీలను తక్షణమే విధు ల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ డిమాండ్ చేశారు.
పార్వతీపురం, అక్టోబరు 18: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశా లల్లో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న గిరిజన సీఆర్టీలను తక్షణమే విధు ల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరి జన సీఆర్టీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంజిత్కుమార్ మాట్లాడుతూ సీఆర్టీల రెన్యువల్కు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఐటీడీఏ పీవో కూర్మనాథ్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు పల్ల సురేష్, గిరిజన సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు డి.సీతా రాం, గిరిజన సీఆర్టీ సంక్షేమ సంగం నాయకులు వెంకటరావు, భవానీకుమార్, గౌరీ, తదితరులు పాల్గొన్నారు.