ఆరోగ్యంపై అవగాహన కోసం సైకిల్ యాత్ర
ABN , First Publish Date - 2021-01-17T05:27:24+05:30 IST
ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు వారణాసికి చెందిన ఉత్కర్షవర్మ చేపట్టిన సైకిల్యాత్ర శనివారం సోంపేట చేరింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆరోగ్యం గురించి ప్రజలు వివ రించేందుకు వారణాసి నుంచి చేపట్టిన యాత్ర వారణాసి వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోంపేట: ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు వారణాసికి చెందిన ఉత్కర్షవర్మ చేపట్టిన సైకిల్యాత్ర శనివారం సోంపేట చేరింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆరోగ్యం గురించి ప్రజలు వివ రించేందుకు వారణాసి నుంచి చేపట్టిన యాత్ర వారణాసి వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతఏడాది డిసెంబరు 20న ప్రారంభించిన యాత్ర ముంబై, చెన్నై, కోల్కత్త మీదుగా వారణాసి చేరుకోనున్నట్లు ఆంధ్రజ్యోతికి తెలిపారు. గతంలో రెండుసార్లు సైకిల్ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇప్పటివరకు 28 రోజుల్లో 4,895 కిలోమీటర్ల మేర ప్రయాణించినట్లు తెలిపారు. ఈయాత్రను లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు వారు పరిశీలిస్తున్నారని తెలిపారు. సైకిల్ యాత్రను సంబంధిత పోలీస్స్టేషన్ల వద్ద జీపీఎస్ ఆధారంగా నమోదు చేస్తున్నట్లు చెప్పారు.