ఎండల మల్లన్నను దర్శించుకున్న డీసీ
ABN , First Publish Date - 2021-01-14T05:14:16+05:30 IST
రావివలస ఎండల మల్లికార్జున స్వామిని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
టెక్కలి, జనవరి 13: రావివలస ఎండల మల్లికార్జున స్వామిని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే టెక్కలిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్యామసుందరస్వామి ఆలయా లను సందర్శించి దేవాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సెక్యూరిటీ చర్యలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఆమెతో పాటు ఇన్స్పెక్టర్ ప్రసాద్బాబు, ఈవో వీవీ నారాయణ ఉన్నారు.
ఇచ్ఛాపురం: అన్ని ఆలయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు తప్సనిసరిగా ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ డీసీ ఎన్.సుజాత ఆదేశించారు. బుధవారం పట్టణం లోని పెద్ద, చిన్న జగన్నాథాల యాలు, శ్రీవారి రఽథమండపం, స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాలను సందర్శించారు. కార్యక్రమంలో ఈవోలు బి.రామారావు, బీవీ మాధవరావు పట్నాయక్ పాల్గొన్నారు.