మృతదేహం గుర్తింపు
ABN , First Publish Date - 2021-06-22T03:27:30+05:30 IST
మండలంలోని కోనేటిరాజుపాళెం గ్రామ సమీపంలో స్థానికులు సోమవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు.
నాయుడుపేట టౌన్, జూన్ 21 : మండలంలోని కోనేటిరాజుపాళెం గ్రామ సమీపంలో స్థానికులు సోమవారం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం మేరకు గ్రామ సమీపంలో ఉన్న ఓ పాత భవనం వెనుక చెట్ల మధ్య నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగరాజు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. 15 రోజుల క్రితం ఆ వ్యక్తి మృతిచెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మొండెం ఓ వైపు, తల మరో వైపు పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో గుర్తించలేని విధంగా ఉంది. సంఘటనా స్థలం వద్ద ఓ మద్యం సీసాను మాత్రమే పోలీసులు గుర్తించారు. ఎవరైనా హత్యచేశారా లేక ఇంకో కారణంతో మరణించాడా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.