వచ్చే నెల 2 నుంచి డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-08-13T14:27:45+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన డిగ్రీపరీక్షలను..

వచ్చే నెల 2 నుంచి డిగ్రీ పరీక్షలు

ఒంగోలు(ప్రకాశం): కరోనా వ్యాప్తి నేపఽథ్యంలో వాయిదా పడిన డిగ్రీపరీక్షలను సెప్టెంబరు 2 నుంచి నిర్వహించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలు నిర్వహించే తేదీలను రీషెడ్యూలు చేస్తూ యూనివర్శిటీ పరీక్షల అడిషనల్‌ కంట్రోలర్‌ ఎ.వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 20న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 2న, మార్చి 21న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 3న , 23న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 4న, 24 జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 5న , 26 న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు6న ,27న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 7న , 28న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 8న , ఏప్రిల్‌ 3న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు 9న , ఏప్రిల్‌ 8న జరగాల్సిన పరీక్ష సెప్టెంబరు10న నిర్వహించమని ఆదేశించారు.పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


Updated Date - 2020-08-13T14:27:45+05:30 IST