Delhi: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

ABN , First Publish Date - 2021-08-27T16:11:27+05:30 IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గంటల్లో దేశంలో 44,658 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా మహమ్మారితో 496 మంది మృతి

Delhi: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన గంటల్లో దేశంలో 44,658 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా మహమ్మారితో 496 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం 3,26,03,188కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో 4,36,861 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 3,44,899 యాక్టివ్ కేసులు ఉండగా, 3.18 కోట్ల మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 61.22 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో పేర్కొంది.

Updated Date - 2021-08-27T16:11:27+05:30 IST