ఢిల్లీలో ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్ను ప్రారంభించిన గవర్నర్
ABN , First Publish Date - 2020-11-26T23:47:48+05:30 IST
ఢిల్లీలో ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్ను ప్రారంభించిన గవర్నర్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్ తొలిసారి అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో పాటు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ నగరంలోని మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్ను ప్రారంభించారు.
సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) కమిషనర్ మాట్లాడుతూ మల్టీ-లెవల్ పార్కింగ్లో నాలుగు టవర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి మొత్తం 34 వాహనాలను కలిగి ఉంటాయని, టవర్ పార్కింగ్ కాలుష్యాన్ని కూడా నియంత్రిస్తుందని దక్షిణ ఢిల్లీ మేయర్ తెలిపారు.