ఢిల్లీలో మళ్లీ అత్యధికంగా 4,086 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-10-24T14:39:50+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు విజృంభించాయి....

ఢిల్లీలో మళ్లీ అత్యధికంగా 4,086 మందికి కరోనా

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు విజృంభించాయి. 34 రోజుల తర్వాత ఒక్క శుక్రవారం రోజే ఢిల్లీలో 4,086 మందికి కరోనా సోకిందని పరీక్షల్లో తేలింది. ఢిల్లీలో కరోనా వల్ల 6,189 మంది మరణించారు. 58,568 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో అత్యధికంగా 4,086 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో దేశ రాజధానిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.48 లక్షలకు చేరింది. గత నెలలో 19వతేదీన 4,071 కరోనా కేసులు నమోదైనాయి. అక్టబరు 23వతేదీ వరకు ఢిల్లీలో 4వేల లోపు కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతోపాటు మృతులసంఖ్య 6,189 కి పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం 26,001 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2020-10-24T14:39:50+05:30 IST