వలస కూలీల బస్సు బోల్తా... పలువురికి గాయాలు!

ABN , First Publish Date - 2021-04-21T11:45:47+05:30 IST

వలస కూలీలతో ఢిల్లీ నుంచి టీమాగఢ్ వెళుతున్న...

వలస కూలీల బస్సు బోల్తా... పలువురికి గాయాలు!

న్యూఢిల్లీ: వలస కూలీలతో ఢిల్లీ నుంచి టీమాగఢ్ వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి జోరసీ ఘాటీ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గ్వాలియర్ జెహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం లాక్‌డౌన్ భయంతో వలస కూలీలంతా ఢిల్లీ నుంచి ఛతర్‌పూర్, టీమాగఢ్‌ జిల్లాలలోని తమ ఇళ్లకు తరలివెళుతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం డ్రైవర్ అత్యంత వేగంగా బస్సును నడపడంతో, అది అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, బోల్తా పడింది. వెంటనే బస్సులోని ప్రయాణికులు పెద్దపెట్టున ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న బిలౌవా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును సవ్యంగా నిలిపి, ప్రయాణికులకు బయటకు తీసుకువచ్చారు. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 





Updated Date - 2021-04-21T11:45:47+05:30 IST