కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన డిప్యూటీ సీఎం సిసోడియా

ABN , First Publish Date - 2020-09-23T23:46:03+05:30 IST

కరోనా కారణంగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బుధవారం ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్ అని గత వారమే రిపోర్టుల్లో

కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన డిప్యూటీ సీఎం సిసోడియా

న్యూఢిల్లీ : కరోనా కారణంగా డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బుధవారం ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్ అని గత వారమే రిపోర్టుల్లో తేలింది. అయితే ప్రస్తుతం శ్వాస తీసుకోవడంలో సమస్యలు రావడంతో ఆయన్ను లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేరారు. ‘‘జ్వరం లక్షణాలు తేలడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నా. దీంట్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయా. ప్రస్తుతానికి మాత్రం జ్వరం లేదు. బాగానే ఉన్నా. మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే విధుల్లో చేరతా’’ అంటూ సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-09-23T23:46:03+05:30 IST