మన్యంలో చింతపండుకు భలే గిరాకీ
ABN , First Publish Date - 2021-03-01T06:29:21+05:30 IST
ఏజెన్సీలో చింతపండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కిలో రూ.40 చొప్పున వర్తకులు గిరిజన రైతుల వద్ద చింతపండును కొనుగోలు చేస్తున్నారు.
కిలో రూ.40 చొప్పున వంట్లమామిడి సంతలో విక్రయం
పాడేరు, ఫిబ్రవరి 28: ఏజెన్సీలో చింతపండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కిలో రూ.40 చొప్పున వర్తకులు గిరిజన రైతుల వద్ద చింతపండును కొనుగోలు చేస్తున్నారు. మండలంలో వంట్లమామిడి వారపు సంతలో ఆదివారం వి.మాడుగులకు చెందిన వర్తకులు కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేశారు. గిరిజన సహకార సంస్థ కిలో రూ.36 చొప్పున కొనుగోలు ధర ప్రకటించినప్పటికీ, వర్తకులు రూ.40 కొనుగోలు చేస్తున్నారు.