జూనియర్‌ న్యాయవాదులను ఆదుకోవాలని డిమాండ్‌

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

జూనియర్‌ న్యాయవాదులను ఆదుకోవాలని డిమాండ్‌

జూనియర్‌ న్యాయవాదులను ఆదుకోవాలని డిమాండ్‌

నందిగామ రూరల్‌, మే 7: కరోనా విపత్కర పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారమై జూనియర్‌ న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తలమాల డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా కోర్టులు తెరుచుకోకపోవటంతో జూనియర్‌ న్యాయవాదులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. జూనియర్‌ న్యాయవాదులను ఆదుకొనేందుకు ప్రభుత్వం రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు రూ. 10 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరోనాతో మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు రూ. ఐదు లక్షల నష్ట పరిహారం అందించాలని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST