కంటైన్మెంట్ల డీనోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-06-01T09:38:58+05:30 IST
నరసరావుపేటలో కంటైన్మెంట్ జోన్ల డీ నోటిఫైడ్పై సబ్ కలెక్టర్ దినేష్కుమార్, ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, కమిషనర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు ఆదివారం సమావేశమయ్యారు.
నరసరావుపేట, మే 31: నరసరావుపేటలో కంటైన్మెంట్ జోన్ల డీ నోటిఫైడ్పై సబ్ కలెక్టర్ దినేష్కుమార్, ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు, కమిషనర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు ఆదివారం సమావేశమయ్యారు. ఈ మేరకు డీ నోటిఫైడ్ అంశంపై కలెక్టర్కు నివేదిక పంపారు. ఎన్జీవో కాలనీ, రామిరెడ్డిపేట, అరండల్పేట, నిమ్మతోట, ఇస్లాంపేట, అల్లూరివారిపాలెం, పల్నాడురోడ్డు ప్రాంతాలు ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయి.
వీటిని డీనోటిఫైడ్ కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. వరవకట్ట, ప్రకాష్నగర్, ఏనుగుల బజారు, పెదచెరువులోని లెనిన్నగర్, లింగంగుంట్ల ప్రాంతాల్లో మాత్రమే ఈ వారంలో కొత్తగా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగించనున్నారు. సోమవారం కంటైన్మెంట్ డీ నోటిఫైడ్ పై ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.