టీడీపీ హయాంలోనే రైతుల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-02-26T05:02:50+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడే రైతులు అభివృద్ధి చెందారని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి
రాచర్ల, ఫిబ్రవరి 25: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడే రైతులు అభివృద్ధి చెందారని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని అనంపల్లె గ్రామంలో జరిగిన గౌరవసభలో ఆయన మాట్లాడారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు గుర్తుచేశారు. మూడేళ్ళక్రితం రైతుల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారిపై భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పంట గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. మోటార్లకు మీటర్లు బిగించి రైతులను నష్టపరిచే కార్యక్రమానికి పూనుకున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కటిక యోగానంద్, మాజీ సర్పంచ్ రామక్రిష్ణారెడ్డి, శిరిగిరి వెంకటపతి, పేర్ల సుధీర్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రియదర్శిని కుటుంబాన్ని పరామర్శించిన ముత్తుముల
కొమరోలు, ఫిబ్రవరి 25: రై లు ప్రమాదంలో మృతి చెందిన పెనుగొండ ప్రియదర్శిని(రవి) కుటుంబసభ్యులను మాజీ ఎ మ్మెల్యే అశోక్రెడ్డి శుక్రవారం కొమరోలులోని ఆర్యమరాఠి కాలనీలో పరామర్శించారు. ఈ సందర్భంగా అశోక్రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రియదర్శిని మృతి చెందడం భాధగా ఉందన్నారు. రవి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. కుమారుడిని పోగొట్టుకున్న పెనుగొండ రమణ దంపతులను ఓదార్చారు. ముందుగా ప్రమాదంలో మృతి చెందిన ప్రియదర్శిని చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీవీ రాఘవరెడ్డి, తిరు మలరెడ్డి. శ్రీనివాసచౌదరి పాల్గొన్నారు.