ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-01-25T05:39:08+05:30 IST
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
మానకొండూర్, జనవరి 24: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని చెంజర్ల, పెద్దూరుపల్లి గ్రామాల్లో మహిళా, యాదవ సంఘ భవనాలతో పాటు వైకుంఠధామాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్, సర్పంచ్ ప్రశాంతి, ఎంపిటీసీ గడ్డి రేణుక, రైతుబంధు మండల అధ్యక్షుడు రామంచ గోపాల్రెడ్డి, నాయకులు ముద్దసాని శ్రీనివాస్రెడ్డి, గడ్డి గణేశ్ పాల్గొన్నారు.