ప్రకటనలకే పరిమితమైన అభివృద్ధి పనులు
ABN , First Publish Date - 2020-08-14T10:31:11+05:30 IST
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు ప్ర కటనలకే పరిమితమయ్యాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు
ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
కొడిమ్యాల, ఆగస్టు 13 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు ప్ర కటనలకే పరిమితమయ్యాయని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. గురువారం ఎ ల్లంపెల్లి నీటితో నిండిన మండలంలోని పోతారం చెరువును, కోనాపూర్ పంప్హౌస్ను పరిశీలించారు. అనంతరం సూ రంపేట గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్లంపెల్లి శ్రీపాద ప్రాజెక్ట్ పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డ్డి హయాంలోనే 90 శాతం పను లు పూర్తయ్యాయన్నారు. పోతారం రిజర్వాయర్ మత్తడి నాలుగున్నర మీటర్ల ఎత్తును పెంచడానికి భూమిని కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వటానికి, కాల్వల నిర్మాణం పూర్తి కావటానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మేడిపెల్లి సత్యం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణగౌడ్, కొడిమ్యాల ఉప సర్పంచ్ జీవన్రెడ్డ్డి, పూడూర్ సింగిల్ విండో ఉపాధ్యక్షుడు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ నాగభూషణ్రెడ్డ్డి పాల్గొన్నారు.