జిల్లా వ్యాప్తంగా ధన్వంతరి హోమాలు

ABN , First Publish Date - 2021-12-03T06:21:52+05:30 IST

ప్రజల ఆరోగ్యం బాగుండాలని, ఆయుష్షు పెరగాలని ఆకాంక్షిస్తూ దేవదాయ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా గురువారం ధన్వంతరి హోమాలు నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా ధన్వంతరి హోమాలు
ధన్వంతరి హోమంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి. పక్కన అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి

విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం బాగుండాలని, ఆయుష్షు పెరగాలని ఆకాంక్షిస్తూ దేవదాయ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా గురువారం ధన్వంతరి హోమాలు నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ధన్వంతరి జయంతి సందర్భంగా వీటిని చేపట్టారు. సూర్యాబాగ్‌లోని విశ్వేశ్వరస్వామి ఆలయంలో బాదంపూడి రమేశ్‌ అప్పాజీ నేతృత్వంలో జరిగిన హోమానికి డిప్యూటీ కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి హాజరయ్యారు. 

Updated Date - 2021-12-03T06:21:52+05:30 IST