ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2021-05-14T05:44:12+05:30 IST

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
ధర్నా చేస్తున్న రైతు, కౌలు రైతు సంఘాల ప్రతినిధులు

గంపలగూడెం, మే 13: మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం అధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు సంఘం ప్రతినిధులు గువ్వల సీతారామిరెడ్డి, గుంటుపల్లి వీరభద్రం, ఎం.వెంకటరెడ్డి, ఎం.కుటుంబరావు, బండి వీరబాబు, గాదె మోహన్‌రెడ్డి, రేగళ్ల కోటిరెడ్డి పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-05-14T05:44:12+05:30 IST