విద్యుత్‌ సమస్య పరిష్కరించాలని ధర్నా

ABN , First Publish Date - 2021-07-25T05:20:13+05:30 IST

జీవీఎంసీ 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌లో విద్యుత్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మల్కాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద శనివారం డీవైఎఫ్‌ఐ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

విద్యుత్‌ సమస్య పరిష్కరించాలని ధర్నా
విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న దృశ్యం

మల్కాపురం, జూలై 24 : జీవీఎంసీ 63వ వార్డు పరిధి క్రాంతినగర్‌లో విద్యుత్‌ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మల్కాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద శనివారం డీవైఎఫ్‌ఐ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు  మాట్లాడుతూ గత రెండు నెలలుగా క్రాంతినగర్‌లో విద్యుత్‌ సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోందని, దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 83ఏ, 106ఏ, 106బీ, టీఆర్‌ నంబర్‌ 161/ఏ ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో ఉన్న ప్రజలు విద్యుత్‌ అంతరాయంతో అవస్థలు పడుతున్నారని చెప్పారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌.వాసు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం క్రాంతినగర్‌ ఏరియా కార్యదర్శి వై.కల్యాణి, నాయకులు హరీశ్‌, రవిశంకర్‌, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:20:13+05:30 IST