మధుమేహులకు కరోనా దెబ్బ
ABN , First Publish Date - 2020-04-17T15:46:15+05:30 IST
కరోనా వైరస్.. టైప్-2 మధుమేహం బాధితుల చికిత్సను దెబ్బతీసే ప్రమాదం ఉం దని తేలింది. ఊబకాయం, మధుమేహం రోగ లక్షణ ఽశరీర ధర్మం(పాథోఫిజియాలజీ) విశ్లేషణ
టొరంటో, ఏప్రిల్ 16: కరోనా వైరస్.. టైప్-2 మధుమేహం బాధితుల చికిత్సను దెబ్బతీసే ప్రమాదం ఉం దని తేలింది. ఊబకాయం, మధుమేహం రోగ లక్షణ ఽశరీర ధర్మం(పాథోఫిజియాలజీ) విశ్లేషణ ద్వారా ఈ సంగతి స్పష్టమైంది. ఈ అధ్యయనం సాగించిన కెనడాలోని టొరంటోలో ఉన్న మౌంట్ సినాయ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ డానియెల్ జె డ్రుకర్ మాట్లాడుతూ.. మనిషిలోని గట్ భాగం, ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలు కరోనాకు కీలకమైన స్థావరాలు. వాటిద్వారా వైరస్ లోపలకు చొరబడి ఇన్ఫెక్షన్గా మారుతుంది. ఆ ప్రాంతాల్లో అలజడి రేపుతుంది. ఇలా విడుదల చేసే ప్రత్యేక ప్రొటీన్లు.. టైప్-2 డయాబెటి్సను వృద్ధి చేస్తాయి. దీనిపై మరింత అధ్యయనం అవసరమని డ్రుకర్ వివరిస్తున్నారు.