బావిలో ఈతకు దిగి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-05-18T06:18:52+05:30 IST

మండలంలోని ఇరుకుపాలెంలో ఈతకని వెళ్లి బావిలోకి దిగి ఎస్సీ కాలనీకి చెందిన గుడిగుండ్ల కిరణ్‌(21) మృతి చెందాడు.

బావిలో ఈతకు దిగి యువకుడి మృతి
గుడిగుండ్ల కిరణ్‌(పాతచిత్రం)

ముప్పాళ్ల, మే17: మండలంలోని ఇరుకుపాలెంలో ఈతకని వెళ్లి బావిలోకి దిగి ఎస్సీ కాలనీకి చెందిన గుడిగుండ్ల కిరణ్‌(21) మృతి చెందాడు. సోమవారం కిరణ్‌ మరో ఇద్దరు స్నేహితులతో  కలసి ఇరుకుపాలెం, మాదల గ్రామాల మధ్యలో ఉన్న బావి వద్దకు వెళ్లారు. ఈతకొట్టేందుకు ముగ్గురూ బావిలో దూకగా ఇద్దరు మాత్రమే బయటకు వచ్చారు. కిరణ్‌కమార్‌ బావి  అడుగుకు వెళ్లి మృతి చెందాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది బావివద్దకు వచ్చి నీటిని తోడి మృతదేహాన్ని వెలికితీశారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్దే ఉంటున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. 


Updated Date - 2021-05-18T06:18:52+05:30 IST