వ్యక్తి అదృశ్యం
ABN , First Publish Date - 2022-08-23T06:31:14+05:30 IST
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.
వలిగొండ, ఆగస్టు 22 : వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చత్తీ్సఘడ్ రాష్ట్రం జహంగీర్చాప జిల్లా కర్గామ్ గ్రామానికి చెందిన జగదీష్ సిద్దార్థ్(55) అనే వ్యక్తి వలిగొండ మండల కేంద్రం చింతబావి వద్ద మూడు నెలల కిందట నుంచి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 20న రాత్రి 7 గంటల సమయంలో మలవిసర్జన కోసం వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో లేబర్ సూపర్వైజర్ సంతో్షకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.