పారిశుధ్య కార్మికుల తొలగింపు అన్యాయం

ABN , First Publish Date - 2021-01-21T04:56:55+05:30 IST

జీవీఎంసీలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో సేవలందిస్తున్న 60 ఏళ్లు నిండిన పారిశుధ్య కార్మికులకు ఎటువంటి హామీ ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

పారిశుధ్య కార్మికుల తొలగింపు అన్యాయం
జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు 

సిరిపురం, జనవరి 20: జీవీఎంసీలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో సేవలందిస్తున్న 60 ఏళ్లు నిండిన పారిశుధ్య కార్మికులకు ఎటువంటి హామీ ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారి తొలగింపును నిరసిస్తూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా బుధవారం నుంచి అరవై ఏళ్లు నిండిన కార్మికులను తొలగించడం భావ్యం కాదన్నారు. కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని, అరవై ఏళ్లు నిండాయని తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, అమ్మఒడి పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.వెంకట్‌రెడ్డి, జి.సుబ్బారావు, ప్రసాద్‌, వెంకన్న, నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T04:56:55+05:30 IST