నిత్యావసరాల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-11T10:28:11+05:30 IST

కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

నిత్యావసరాల పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌/సుభాష్‌నగర్‌, మే 10: కరోనా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బత్తాయి పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయని అన్నారు. డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ బస్టాండ్‌లో  మేయర్‌ సునీల్‌రావుతో కలిసి బత్తాయి పండ్లను పంపిణీ చేశారు.


  మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని పేద బ్రాహ్మణ మహిళలకు శ్రీసేవామార్గ్‌ సంస్థ అధ్యక్షురాలు మునిపల్లి ఫణిత ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు కొలిపాక మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో మేయర్‌ సునీల్‌ రావు చేతుల మీదుగా బత్తాయి పండ్లు పంపిణీ చేశారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలోని 17,18,19డివిజన్‌లలో న్యూరో స్పెషాలిటీ వైద్యుడు సతీష్‌ ఆఽధ్వర్యంలో బీజేపీ నాయకుడు జాడి బాల్‌రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆర్‌కే డాన్స్‌ అకాడమీ చైర్మన్‌ సంగెం రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపచేశారు.

Updated Date - 2020-05-11T10:28:11+05:30 IST