ఐరిష్ ద్వారా రేషన్ పంపిణీ
ABN , First Publish Date - 2020-09-17T11:13:51+05:30 IST
మండలంలోని అన్ని గ్రామాల్లో ఇకపై ఐరిష్ రిజిస్ట్రేషన్ ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు.
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 16: మండలంలోని అన్ని గ్రామాల్లో ఇకపై ఐరిష్ రిజిస్ట్రేషన్ ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు. బుధవారం మండలంలోని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేలిముద్రలు రాక చాలా మందికి రేషన్ అందడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీంతో ఐరిష్ ద్వారా రేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.