నెలాఖరు వరకు బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-04-08T10:50:21+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల చివరి వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడానికి రేషన్‌

నెలాఖరు వరకు బియ్యం పంపిణీ

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 7: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల చివరి వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడానికి రేషన్‌ డీలర్లలందరూ సిద్దంగా ఉన్నట్లు రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వర్‌ సమస్యతో బియ్యం పంపిణీలో జాప్యం జరిగిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సూర్యాపేట పట్టణంలో పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని ఆ ప్రాంతంలో ఉన్న లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేసే విషయయమై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-04-08T10:50:21+05:30 IST