జిల్లాలో బర్డ్ఫ్లూ లేదు : పశుసంవర్థకశాఖ జేడీ
ABN , First Publish Date - 2021-01-16T05:50:12+05:30 IST
జిల్లాలో బర్డ్ఫ్లూ లేదని పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ విజయకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నెల్లూరు(వ్యవసాయం), జనవరి 15 : జిల్లాలో బర్డ్ఫ్లూ లేదని పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్ విజయకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు. వాకాడు మండలం బూడిదలవాగు ప్రాంతంలో వందల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని ఓరైతు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. దీంతో 12వతేదీన ఆగ్రామానికి వెళ్లి చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ తీశామని పేర్కొన్నారు. వాటిని విజయవాడలోని వెటర్నరీ బైలాజికల్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్కు పంపామని తెలిపారు. శుక్రవారం వచ్చిన ఫలితాల్లో బర్డ్ఫ్లూ కాదని తేలిందన్నారు. కోళ్ల ఫారం నిర్వాహకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్ఠం చేశారు. కోళ్ల నుంచి మనుషులకు బర్డ్ఫ్లూ వచ్చిన కేసు ఇప్పటి వరకు ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు.