జడ్పీ వైస్చైర్మన్కు పితృ వియోగం
ABN , First Publish Date - 2021-01-16T05:16:04+05:30 IST
జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ తండ్రి గోపగాని శ్రీరాములు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు.
ఆత్మకూర్(ఎస్), జనవరి 15 : జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ తండ్రి గోపగాని శ్రీరాములు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను బొప్పారం గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. మంత్రి గుంటకండ్ల జగదీ్షరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమే్షరెడ్డిలు శ్రీరాములు మృతదేహాంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. వెంకటనారాయణగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సూర్యాపేట మునిసిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవిఆనంద్, అర్వపల్లి జడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బయ్య మల్లయ్యయాదవ్, నాయకులు నిమ్మల శ్రీనివా్సగౌడ్, పెద్దిరెడ్డి రాజా, మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, కొణతం సత్యనారాయణరెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, జీడి బిక్షం, సుంకరి భిక్షమయ్యగౌడ్, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.