dmkలోకి అన్నాడీఎంకే వార్డు సభ్యులు
ABN , First Publish Date - 2021-10-21T13:38:19+05:30 IST
నామక్కల్ జిల్లా యూనియన్ పంచాయతీలో అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు సభ్యులు బుధవారం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 17 గ్రామీణ వార్డు సభ్యులు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో
ప్యారీస్(chennai): నామక్కల్ జిల్లా యూనియన్ పంచాయతీలో అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు సభ్యులు బుధవారం డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 17 గ్రామీణ వార్డు సభ్యులు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపొందగా, వీరిలో 13 మంది అన్నాడీఎంకే కూటమికి చెందిన వారు కాగా, మిగతా నలుగురు డీఎంకే కూటమి నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే కూటమికి చెందిన ముగ్గురు డీఎంకేలో చేరగా, మరొకరు తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో డీఎంకే గెలిచింది. దీని ద్వారా డీఎంకే బలం 8గా పెరిగింది. బుధవారం నామక్కల్లోని డీఎంకే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి మదివేందన్ సమక్షంలో అన్నాడీఎంకే తరఫున గెలిచిన వార్డు సభ్యులు శివప్రకాశం, ప్రేమ డీఎంకే కండువా కప్పుకున్నారు.