వదంతులను నమ్మకండి.. టీకా తీసుకోండి
ABN , First Publish Date - 2021-01-17T07:54:07+05:30 IST
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసినపుడు ఓ కాలర్ ట్యూన్ వినిపించేది. ‘‘నమస్కారం..
కరోనా కొత్త కాలర్ ట్యూన్ విడుదల
న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసినపుడు ఓ కాలర్ ట్యూన్ వినిపించేది. ‘‘నమస్కారం.. కొవిడ్-19తో మన దేశమే కాదు ప్రపంచమంతా పోరాడుతోంది. మనమంతా అప్రమత్తంగా ఉండాలి..’’ అంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చెప్పే సందేశం వినిపించేంది. వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైన నేపథ్యంలో మరో కాలర్ ట్యూన్ వచ్చింది.
‘‘కొవిడ్-19పై పోరాటంలో ఈ నూతన సంవత్సరం వ్యాక్సిన్ రూపంలో సరికొత్త ఆశాకిరణం వచ్చింది. మన దేశంలో తయారైన కరోనా టీకా అత్యంత సురక్షితం, ప్రభావశీలమైనది. వ్యాక్సిన్ను నమ్మండి.. వదంతులను కాదు.. మీ వంతు వచ్చినపుడు తప్పక టీకా వేయించుకోండి’’ అనే కొత్త కాలర్ ట్యూన్ను అధికారులు విడుదల చేశారు.