ప్రాణాలతో చెలగాటమొద్దు
ABN , First Publish Date - 2021-10-14T05:02:34+05:30 IST
ఇసుక లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని పలు గ్రామాల ప్రజలు హెచ్చరించారు. అంగూరు, ఆకుల తంపర గ్రామాల వంశధార నదిలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ బుధవారం రాత్రి గురండి సమీపంలో సర్పంచ్ బోర సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో స్థానికులు లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు.
ఇసుక లారీలను అడ్డుకుని నిరసన
కొత్తూరు: ఇసుక లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని పలు గ్రామాల ప్రజలు హెచ్చరించారు. అంగూరు, ఆకుల తంపర గ్రామాల వంశధార నదిలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ బుధవారం రాత్రి గురండి సమీపంలో సర్పంచ్ బోర సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో స్థానికులు లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఇసుక లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయన్నారు. ఇసుక లోడ్తో వాహనాలు కలిగాం, బమ్మిడి, ఆకులతంపర, మదనాపు రం, అంగూరు, ఆర్కెపురం, సోమ రాజపురం తదితర గ్రామాల గుండా రాకపోకలు సాగించడంతో రోడ్డు మీదకు రావాలంటే భయాందోళన చెందుతున్నామన్నారు.