ఓటీఎస్కు పైసా చెల్లించవద్దు
ABN , First Publish Date - 2021-12-03T06:12:43+05:30 IST
శాశ్వత గృహ హక్కు కోసం గిరిజనులు ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించవద్దని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు.
టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర
హుకుంపేట, డిసెంబరు 2: శాశ్వత గృహ హక్కు కోసం గిరిజనులు ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించవద్దని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర అన్నారు. మండలంలో జర్రకొండ పంచాయతీ పరిధిలో గనికి, డిర్రాపల్లి, తోటమామిడి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈసందర్భంగా వైసీపీకి చెందిన సుమారు 30 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దొన్నుదొర మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే ప్రజలు కష్టాలు తీరుతాయన్నారు. ఈకార్యక్రంలో మాజీ సర్పంచ్ బొంజుబాబు, టీడీపీ నేత శంకర్, తదితరులు పాల్గొన్నారు.