అర్జెంట్ అంటూ కారును ఆపి మరీ టాయ్‌లెట్‌కు వెళ్లిన నవవధువు.. ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-02-10T21:41:44+05:30 IST

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ కొంచెం విభిన్నంగా ఉంటుంది. అర్జెంట్ అంటూ కారు ఆపిన ఓ నవ వధువు.. టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే ఎంతకూ బయటికి రాకపోవడంతో వెళ్లి చూసి అంతా అవాక్కయ్యారు...

అర్జెంట్ అంటూ కారును ఆపి మరీ టాయ్‌లెట్‌కు వెళ్లిన నవవధువు.. ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు కేవలం శారీరక సుఖం కోసమే ప్రేమ పేరుతో నాటకమాడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో యువతులే ఎక్కువగా మోసపోతుంటారు. ఇంకొందరు ప్రేమికులు.. తమ ప్రేమను నెగ్గించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ప్రాణాలైనా తీసుకుంటారు గానీ.. ప్రేమను మాత్రం వదులుకోరు. కొన్నిసార్లు ఎంత గాఢ ప్రేమికులైనా పెద్దల బలవంతం మీద తమ ప్రేమను త్యాగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ కథ కొంచెం విభిన్నంగా ఉంటుంది. అర్జెంట్ అంటూ కారు ఆపిన ఓ నవ వధువు.. టాయ్‌లెట్‌కు వెళ్లింది. అయితే ఎంతకూ బయటికి రాకపోవడంతో వెళ్లి చూసి అంతా అవాక్కయ్యారు. ఈ కథలో చివరకు ఏం జరిగిందో తెలుసుకుందాం..


ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌‌కు చెందిన ఆర్తి సహారే అనే యువతికి, మహారాష్ట్రలోని సావర్‌గావ్‌కు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. ఫిబ్రవరి 6న వివాహ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మరుసటి రోజు పెళ్లికుమారుడి గ్రామానికి బయలుదేరారు. పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి యువతి మొఖంలో సంతోషం లేదు. కొన్ని రోజులు పోతే అంతా సర్దుకుంటుందిలే అని పెళ్లికుమారుడి కుటుంబ సభ్యులు అనుకున్నారు. వధూవరులు ఇద్దరూ కారులో బయలుదేరారు. మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాహనాలు ఆపారు. బాత్రూంకు వెళ్లొస్తానని భర్తకు చెప్పి ఆ యువతి లోపలికి వెళ్లింది. అయితే ఎంతకీ ఆమె బయటికి రాలేదు. దీంతో అనుమానం వచ్చి బాత్రూం తలుపులు బద్దలుకొట్టి చూడగా లోపల వధువు కనిపించలేదు.

తప్పు చేస్తున్నావు.. పద్ధతి మార్చుకో.. అంటూ భర్త చెప్పింది విని ఆ భార్యలో మార్పు.. కానీ చివరకు షాకింగ్ సీన్..!


వధువు అదృశ్యమవడంతో కంగారుపడిన వరుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్తి సహారే పెళ్లికి ముందే వికాస్ గుప్తా అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఆర్తికి బలవంతంగా పెళ్లి చేశారు. ఎలాగైనా ప్రియుడితో వెళ్లిపోవాలని భావించిన యువతి.. ఈ విషయాన్ని అతడితో చెప్పింది.‘‘ పెళ్లి కూడా జరిగిపోయింది.. ఇప్పుడు పారిపోతే బాగుండదేమో’’.. అని ప్రియుడు వారించాడు. అయినా ఒప్పుకోని యువతి.. ఎలాగైనా తాను చెప్పిన స్థలం వద్దకు రావాలంటూ ప్రియుడికి వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేసింది. బాత్రూంకు వెళ్తున్నానని భర్తతో చెప్పి.. కిటికీ అద్దాలు తొలగించి ప్రియుడి వద్దకు వెళ్లింది. ఇలా పారిపోవడం పద్ధతి కాదని ప్రియుడు వారిస్తున్నా వినకుండా.. అతన్ని బలవంతంగా తీసుకెళ్లింది. ఇద్దరూ మాన్‌పూర్ పట్టణానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తళ్లయిన పెళ్లికూతురు.. పీటలపైనే కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు విషయం తెలిసింది..

Updated Date - 2022-02-10T21:41:44+05:30 IST