విద్యార్థినిపై డాక్టర్ అత్యాచారం
ABN , First Publish Date - 2020-07-09T14:56:06+05:30 IST
పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా పెద్దనాయకన్పాళయం సమీపం కరుమతురై ప్రాంతంలో క్లినిక్
చెన్నై: పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా పెద్దనాయకన్పాళయం సమీపం కరుమతురై ప్రాంతంలో క్లినిక్ నడుపుతున్న మదియళగన్ (24) కరోనా కారణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థినితో డాక్టర్కు పరిచయం ఏర్పడింది. 18 ఏళ్లు నిండిన తరువాత వివాహం చేసుకుంటానంటూ ఆ డాక్టర్ మాయమాటలు చెప్పి బాలికను మోసంచేశాడు. ఇదిలా ఉండగా ఆ డాక్టర్కు మరో అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలుసుకున్న విద్యార్థిని దిగ్ర్భాంతికి గురైంది. దీని గురించి బాలిక కరుమతురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద డాక్టర్ను అరెస్టు చేశారు.