మాస్క్ నిబంధన మీకు వర్తించదా.. సీఎంను ట్విట్టర్లో ప్రశ్నించిన మాజీమంత్రి ఉమా
ABN , First Publish Date - 2020-09-27T15:15:38+05:30 IST
మాస్క్ నిబంధన మీకు వర్తించదా సీఎం గారూ..! అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు..
జి.కొండూరు(కృష్ణా): మాస్క్ నిబంధన మీకు వర్తించదా సీఎం గారూ..! అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్ వేదికగా ప్రశ్నిం చారు. మాస్క్ లేదని కిరణ్ అనే వ్యక్తిని ఎందుకు కొట్టి చంపాల్సి వచ్చింది.. మీతో పాటు మీ ప్రజా ప్రతినిధులు కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారెందుక న్నారు. దేవాలయాలపై దాడుల వెనక ఉన్న చీకటి అంజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేవారు. మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర కేసులపై ఉన్న శ్రద్ధ తన బాబాయి వివేకా హత్య కేసుపై జగన్కు లేదన్నారు.
రాష్ట్రంలో మాల్స్ తరహా మద్యం షాపులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్స్ ఎవరి ప్రయోజనం కోసం ఇచ్చిందో చెప్పాలన్నారు. సంక్షేమ పథకాల తరహాలో వాకిన్ స్టోర్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఉన్న షాపులకు తగ్గించకుండా యథావిధిగా కొనసాగించడమేనా సంపూర్ణ మద్య పాన నిషేధం అంటే.. ఇసుకతో పాటు సిమెంట్ ధరలు భారీగా పెరగడంతో పక్కా గృహాల నిర్మాణం అంటేనే ప్రజలు భయపడుతున్నారన్నారు. మీ ప్రభుత్వంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలో చెప్పండి సీఎం జగన్ గారు..! అని ఉమా ట్వీట్ చేశారు.