ఆలయ అభివృద్ధికి దాతలు కృషి చేయాలి
ABN , First Publish Date - 2020-09-25T05:49:12+05:30 IST
ఆలయాల అభివృద్ధికి దాతలు సహాయ సహకా రాలు అందించి దేవస్థాన అభివృద్ధిలో పాలు పంచుకోవాలని గూడెం దేవస్థాన
దండేపల్లి,సెప్టెంబరు 24: ఆలయాల అభివృద్ధికి దాతలు సహాయ సహకా రాలు అందించి దేవస్థాన అభివృద్ధిలో పాలు పంచుకోవాలని గూడెం దేవస్థాన కార్యనిర్వహణాధికారి వడ్లూరి అనూష సూచించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశానుసారం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయ కార్యాలయంలో గురువారం దాతలతో సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లా డుతూ గతంలో ఈ ఆలయానికి దాతల సహాయ సహకారాలతో ఆలయ అభివృ ద్ధి చెందిందన్నారు.
కరోనా కష్టకాలంలో ఆలయానికి ఆదాయం తగ్గిందన్నారు. దాతలు ముందుకు వచ్చి అభివృద్ధికి సహకరించాలన్నారు. చింతగట్టుకు చెందిన ఆలయ దాత సధాశివరెడ్డి ముందుకు వచ్చి గోదావరి నది నుంచి దేవస్ధానం వరకు వాటర్ సప్లై కొరకు మోటార్ బిగించుటకు ఒప్పుకోవడంతో ఆయనను సన్మానించారు. ఆలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చంద్రశేఖర్, సత్యనా రాయణ, అంజయ్య, ఆలయ సిబ్బంది దాతలు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధి దాతలకు సన్మానం
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని శ్రీవిశ్వనాథ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు వారం అభివృద్ధికి తోడ్పడుతున్న పలువురు దాతలను గురువారం ఘనంగా సన్మానించారు. 16వ వార్డు కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్ దాతగా వ్యవహరిస్తు న్నం దున ఆయనను ఆలయ అర్చకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఆలయ ఈఓ రవికుమార్, అర్చకులు, ఇతక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.