ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దు

ABN , First Publish Date - 2021-06-18T06:05:45+05:30 IST

కరోనా కష్టకాంలో జీవనోపాధే కష్టతరంగా మారిన తరుణంలో పాఠశాలల ఫీజుల పేరుతో పోషకులను, పి ల్లలను ఇబ్బందులకు గురిచేయవద్దని బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రెం టం జగదీష్‌ అన్నారు.

ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దు
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న బీజేవైయం నాయకులు

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీష్‌ 

జగిత్యాల అగ్రికల్చర్‌, జూన్‌ 17: కరోనా కష్టకాంలో జీవనోపాధే కష్టతరంగా మారిన తరుణంలో పాఠశాలల ఫీజుల పేరుతో పోషకులను, పి ల్లలను ఇబ్బందులకు గురిచేయవద్దని బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రెం టం జగదీష్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన అనంతరం, ఫీజుల భారం తగ్గించాలంటూ కలెక్టరేట్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ విద్యార్థులను, వారి తల్లితండ్రులను ఇ బ్బందులకు గురిచేసే కార్పొరేట్‌ ప్రైవేట్‌ పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం నాయకులు దొనికెల నవీ న్‌, మెరుగు ఉమేష్‌, మర్రిపెల్లి గంగాధర్‌, గుర్రం రంజిత్‌రెడ్డి, కోండ్ర రవితేజ, ప్రేమ్‌ సాగర్‌, మహేష్‌, సాయికిరణ్‌, నిఖిల్‌ తదితరులున్నారు.


Updated Date - 2021-06-18T06:05:45+05:30 IST