ఎస్సారార్ నుంచి దిగువకు నీటి విడుదల
ABN , First Publish Date - 2021-01-18T05:49:24+05:30 IST
మండలంలోని శ్రీరాజారాజేశ్వర జలాశయం నుంచి దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాంకు ఆది వారం ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
బోయినపల్లి, జనవరి 17: మండలంలోని శ్రీరాజారాజేశ్వర జలాశయం నుంచి దిగువన ఉన్న లోయర్ మానేరు డ్యాంకు ఆది వారం ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా ప్రాజెక్ట్కు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని గాయత్రి పంప్హౌస్ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 27.5 టీఎంసీలకు 25.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది.