ఎస్సారార్‌ నుంచి దిగువకు నీటి విడుదల

ABN , First Publish Date - 2021-01-18T05:49:24+05:30 IST

మండలంలోని శ్రీరాజారాజేశ్వర జలాశయం నుంచి దిగువన ఉన్న లోయర్‌ మానేరు డ్యాంకు ఆది వారం ప్రాజెక్ట్‌ రెండు గేట్లను ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఎస్సారార్‌ నుంచి దిగువకు నీటి విడుదల
రాజారాజేశ్వర జలాశయం నుంచి రెండు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

 బోయినపల్లి, జనవరి 17: మండలంలోని శ్రీరాజారాజేశ్వర జలాశయం నుంచి దిగువన ఉన్న లోయర్‌ మానేరు డ్యాంకు ఆది వారం ప్రాజెక్ట్‌ రెండు గేట్లను ఎత్తి  మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని గాయత్రి పంప్‌హౌస్‌ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 27.5 టీఎంసీలకు  25.57 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Updated Date - 2021-01-18T05:49:24+05:30 IST