టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతాం
ABN , First Publish Date - 2022-06-06T06:23:00+05:30 IST
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూ, ఎనిమిదేళ్ల కాలవ్యవఽధిలో కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు
జగిత్యాల అర్బన్, జూన్ 5: ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూ, ఎనిమిదేళ్ల కాలవ్యవఽధిలో కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆది వారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా సేవ, సుపరిపాలన, గరీబ్ కళ్యాణ్ పథకాలను ప్రజలకు ప థకాలను వివరించే లక్ష్యంగా రూపొందించిన కరపత్రంను ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ, మండల, మేడిపెల్లి మండలాల అధ్యక్షులు వీరబత్తిని అనిల్, నలువాల తిరుపతి, ముంజ రఽశీనివాస్, పట్టణ కార్యదర్శి ఆముదరాజు, ఉపాధ్యక్షుడు పవన్సింగ్ తదితరులున్నారు.