వ్యాపారస్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2021-04-14T05:16:35+05:30 IST
వ్యాపారస్తులు కొవిడ్ నిబంధనలు పాటించక పోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్ స్పష్టం చేశారు.
ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్కిరణ్
ఏలూరు క్రైం, ఏప్రిల్ 13 :వ్యాపారస్తులు కొవిడ్ నిబంధనలు పాటించక పోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్పీ డాక్టర్ ఒ.దిలీప్ కిరణ్ స్పష్టం చేశారు. ఏలూరు వన్టౌన్ కల్యాణ మండ పంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో అవగాహన సదస్సు మంగళవారం నిర్వి హంచారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు వ్యాపార సముదాయాల్లో అమ్మకాలు, కొనుగోలు చేసే వినియోగదారులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా భౌతిక దూరం పాటించేలా, చేతులను శానిటైజర్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ వై.బాలరాజాజీ, ఎస్ఐలు నాగేంద్రప్రసాద్, రామకృష్ణ, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు.