చినవెంకన్న ఆలయానికి కేంద్ర నిధులు రూ.83.33 కోట్లు
ABN , First Publish Date - 2020-12-04T06:04:50+05:30 IST
ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రసాద్ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.83.33 కోట్లకు ఆమోదం లభించినట్టు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు భరత్రామ్ తెలిపారు.
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రసాద్ స్కీమ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.83.33 కోట్లకు ఆమోదం లభించినట్టు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు భరత్రామ్ తెలిపారు. ఈ మేరకు వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ భరత్ రామ్ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ద్వారా ఆమోదం లభించినట్టు తెలిపారు.