ఎర్లీ బర్డ్‌.. నేటితో ఆఖరు..!

ABN , First Publish Date - 2020-05-31T10:21:39+05:30 IST

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది.

ఎర్లీ బర్డ్‌.. నేటితో ఆఖరు..!

హైదరాబాద్‌ సిటీ, మే 30(ఆంధ్రజ్యోతి): 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది. ముందస్తుగా పన్ను చెల్లించిన వారికి జీహెచ్‌ఎంసీ ప్రతి యేటా ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. వాస్తవంగా ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్‌ నెలలో ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ యేడాది మే 31 వరకు పొడిగించారు.


రూ.30 వేల లోపు ఉన్న నివాస కేటగిరీ భవనాలకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నివాస, వాణిజ్య, బహుళ వినియోగ భవనాలకు ఎంత పన్ను ఉన్నా వర్తిస్తుందని పేర్కొన్నారు. రాయితీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆదివారం సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాయని, పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ లోకే్‌షకుమార్‌ సూచించారు. ఆన్‌లైన్‌, బిల్‌ కలెక్టర్ల ద్వారా కూడా చెల్లింపునకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-31T10:21:39+05:30 IST