2020లో స్పీడు పెంచిన భూమి.. 28సార్లు రికార్డులు బద్దలు!

ABN , First Publish Date - 2021-01-10T01:39:33+05:30 IST

భూమి తన చుట్టూ తాను తిరిగే సమయాన్ని మనం ఓ రోజుగా పరిగణిస్తాం. ఇలా తన చుట్టూ తాను తిరగడానికి భూమికి సుమారు 24 గంటలు పడుతుంది.

2020లో స్పీడు పెంచిన భూమి.. 28సార్లు రికార్డులు బద్దలు!

ఇంటర్నెట్ డెస్క్: భూమి తన చుట్టూ తాను తిరిగే సమయాన్ని మనం ఓ రోజుగా పరిగణిస్తాం. ఇలా తన చుట్టూ తాను తిరగడానికి భూమికి సుమారు 24 గంటలు పడుతుంది. అయితే 2020లో మాత్రం భూమి గేరు మార్చినట్లుంది. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా 28సార్లు అత్యంత వేగంగా తన చుట్టూ తాను తిరిగేసిందట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా 2020 జూలై 19న అత్యంత వేగంగా రోజు ముగిసిందట. సాధారణంతో పోలిస్తే ఆ రోజు 1.4602 మిల్లీసెకండ్లు త్వరగా భూభ్రమణం పూర్తయిందట. గతంలో ఇలా 2005 జూలై 5న జరిగింది. ఆ రోజు భూభ్రమణం 1.0516మిల్లీ సెకండ్లు ముందుగా పూర్తయిందట. ఇలా వేగంగా భూభ్రమణం పూర్తయిన ఘటనలు ఒక్క 2020లో 28సార్లు జరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే మనం త్వరలోనే గడియారాల్లో మార్పులు చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడొచ్చని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-01-10T01:39:33+05:30 IST