లంచం అడిగిన ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-01T05:37:08+05:30 IST

తెనాలి మండలంలో ఉపాధ్యాయిని ఎరియర్స్‌ బిల్లులు చెల్లించడానికి రూ.40వేలు డిమాండ్‌ చేసిన ఎంఈవో లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

లంచం అడిగిన ఎంఈవోపై చర్యలు తీసుకోవాలి

 గుంటూరు(విద్య), నవంబరు 30: తెనాలి మండలంలో ఉపాధ్యాయిని ఎరియర్స్‌ బిల్లులు చెల్లించడానికి రూ.40వేలు డిమాండ్‌ చేసిన ఎంఈవో లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, కె.నాగమల్లేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్జేడీ రవీంధ్రనాథ్‌రెడ్డిని కలిసి   వినతిపత్రం అందజేశారు. కాగా.. లంచం డిమాండ్‌ చేవామని చెప్పడం అవాస్తమని తెనాలి ఎంఈవో లక్ష్మీనారాయణ, మండల ఎమార్సీ, సీఆర్‌పీలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  అవాస్తలు చెప్పిన సదరు టీచర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకటనలో పేర్కొనారు.

Updated Date - 2020-12-01T05:37:08+05:30 IST