జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు కృషి : మంత్రి
ABN , First Publish Date - 2020-06-03T09:40:19+05:30 IST
జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం నిరాడంబరంగా జరిగాయి. లాక్డౌన్ సందర్భంగా కొద్దిమందితో
(ఆంధ్రజ్యోతి సూర్యాపేట న్యూస్నెట్వర్క్): జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం నిరాడంబరంగా జరిగాయి. లాక్డౌన్ సందర్భంగా కొద్దిమందితో రాజకీయ, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయజెండాను ఎగురవేసి నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు, జిల్లా గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివా్సగౌడ్, సీపీఐ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి దోరేపల్లి శంకర్, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రవీందర్రెడ్డి, తెలంగాణ నాన్ గెజిటడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు జానిమియా జాతీయజెండాను ఎగురవేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ భాస్కరన్ జాతీయ జెండాను ఎగురవేశారు. సూర్యాపేట మండల పరిఽధిలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడీ బిక్షం, చిలుకూరులో మండలంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతి, జడ్పీటీసీ శిరీషానాగేంద్రబాబు, చింతలపాలెం మండలంలో ఎంపీపీ కొత్తమది వెంకటరెడ్డి, ఎంపీడీవో గ్యామానాయక్, గరిడేపల్లి మండలంలో సర్పంచ్ సీతారాంరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు నాగయ్య, బీజేపీ ఆధ్వర్యంలో పోకల వెంకటేశ్వర్లు, మేళ్లచెర్వులో ఎంపీపీ కొట్టె పద్మసైదేశ్వరరావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, నేరేడుచర్లలో ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, మునిసిపాలిటీ చైర్మన్ జయబాబు, టీడీపీ అధ్యక్షుడు రమేష్, మఠంపల్లిలో ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్, కోదాడ మండలంలో ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్, ఎంపీపీ కవితారెడ్డి, జడ్పీటీసీ కృష్ణకుమారి, ఎంవీఐ సుభాష్, ఏడిఏ వాసు, అనంతగిరి మండలంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ పద్మ, మోతె మండలంలో ఎంపీపీ ముప్పాని ఆశ, జడ్పీటీసీ పుల్లారావు, వైస్ఎంపీపీ సునీతామల్లారెడ్డి, మునగాల మండలంలో ఎంపీపీ ఎలక బిందునరేందర్రెడ్డి, సర్పంచ్ చింతకాయల ఉపేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొగరు రమేష్, పెన్పహాడ్ మండలంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, ఆత్మకూర్(ఎస్) మండలంలో ఎంపీపీ స్వర్ణలత, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, తిరుమలగిరి పట్టణంలో మునిసిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనిరాజశేఖర్, ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంకెపల్లి రఘునందన్రెడ్డి, జడ్పీటీసీ దూపటి అంజలి, మద్దిరాల మండలంలో ఎంపీపీ గుడ్ల ఉపేంద్రవెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రజాక్, చివ్వెంల మండలంలో ఎంపీపీ కుమారి, తహసీల్దార్ పులి సైదులు, అర్వపల్లి మండలంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మినర్సయ్యయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్రెడ్డి, పాలకవీడు మండలంలో ఎంపీపీ భూక్యా గోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మలిమంటి దుర్గారావు, నడిగూడెం మండలంలో తహసీల్దార్ దేవకరుణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి,తుంగతుర్తి మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు.
సూర్యాపేట కలెక్టరేట్లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా స్థాయి మహిళా అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి శీరిష, జేడీఏ జ్యోతిర్శయి, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జ్యోతి, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.