రైతు సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2021-08-01T05:13:55+05:30 IST
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం తామరాపల్లిలో రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయ నూతన భవనాలను ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట, జూలై 31 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం తామరాపల్లిలో రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయ నూతన భవనాలను ప్రారంభించారు. రైతులకు విత్తనాలు ఎరువులు, పురుగు మందులు ఆర్బీకే ద్వారా ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాన దాలినాయుడు, నాయకులు ఆరంగి మురళి, చింతు రామారావు, కోరాడ చంద్ర భూషణగుప్త, సర్పంచ్ ముచ్చ కరుణ తదితరులు పాల్గొన్నారు.